బ్రేకింగ్ : లారీ కారు ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్

లారీ కారు ఢీ కొనగా ముగ్గురు మృతి చెందారు.

Update: 2023-05-22 02:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలికొంది. ఈ యాక్సిడెంట్‌లో మరొకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. లారీ కారు ఢీ కొనగా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను స్వామి, రమేష్, కృష్ణగా పోలీసులు గుర్తించారు. ముమ్మిడి వరం ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News