BREAKING: భారీ వర్షాల ఎఫెక్ట్.. సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దైంది.

Update: 2024-08-31 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దైంది. ఓర్వక‌ల్లో ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సింది ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషంలో సీఎం పర్యటన క్యాన్సిల్ అయింది. మరోవైపు భారీ కురుస్తున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మినహాయింపునిచ్చారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఇక వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్లు డిస్టిబ్యూషన్ కొనసాగుతోందని సీఎం తెలిపారు. 


Similar News