BREAKING : వైసీపీ నేత బొప్పన భవకుమార్‌తో వంగవీటి రాధ భేటీ.. ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం

ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వివిధ పార్టీల నేతలు ఈ పార్టీలోంచి.. ఆ పార్టీకి జంప్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.

Update: 2024-01-13 16:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వివిధ పార్టీల నేతలు ఈ పార్టీలోంచి.. ఆ పార్టీకి జంప్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా బెజవాడ రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ తాజాగా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ రాత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ భవకుమార్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. గతంలో ఇరువురి మధ్య పాత పరిచయాలు ఉండగా ఆయనను రాధ టీడీపీలోకి ఆహ్వానించేందుకు ఆయన ఇంటి వెళ్లారు.

తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు గంట సేపు సుధీర్ఘంగా చర్చించుకున్నారు. ఈ ఉదయం భవకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీని వీడకూడదని తనపై తీవ్ర ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ నేతలతోనూ సంప్రదిస్తున్నా, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో మాట్లాడి త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని భవకుమార్ స్పష్టం చేశారు. ఇంకా చాలా మంది వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నాదని తెలిపారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన భవకుమార్‌, 2019 నుంచి విజయవాడ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News