BREAKING: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. రాష్ట్రంలోకి సీబీఐకి గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-20 15:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపై రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ మంగళవారం రాత్రి గెజిట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ కండీషన్‌ను గెజిట్‌లో యాడ్ చేసింది. అదేవిధంగా ఈ ఉత్తర్వులు జూలై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. కాగా, 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారు.   

Tags:    

Similar News