BIG BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంలో ACB తనిఖీలు

రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2024-08-13 02:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటుటన్న వారిపై ఏసీబీ దూకుడు పెంచింది. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటిని మొత్తం తమ అధీనంలోకి తీసుకుని 15 మంది అధికారులు రమేష్ ఇంటిని జల్లెడ పడుతున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

Tags:    

Similar News