బ్రేకింగ్ : ఎన్నికల వేళ ఐఏఎస్‌లకు జగన్ సర్కారు షాక్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ గవర్నమెంట్ భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.

Update: 2023-04-07 02:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ గవర్నమెంట్ భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 57 మంది అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. వీరిలో కొందరు సీనియర్ అధికారులు ఉండగా, 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, 9 జిల్లాలకు జాయింట్ కలెక్టర్లుగా బదిలీ అయ్యారు. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉండగా ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ లను బదిలీ చేయడంతో ఏపీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. కీలక హోదాల్లో ఉన్న ఆఫీసర్లను సైతం అప్రాధాన్య పోస్టుల్లో నియమించడం దుమారం రేపింది. అయితే కొన్ని రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు ఉంటాయని ప్రచారం సాగుతుంది. ఇందుకు అనుగుణంగానే ఈ రోజు భారీ ట్రాన్స్ ఫర్స్ చేస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.  

Tags:    

Similar News