Bapatla: బీచ్ లో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.. ఏపీ డీజీపీ అభినందనలు

బీచ్ లో ఈత సరదా ఓ వ్యక్తికి ప్రాణం మీదికి తెచ్చినంత పని అయ్యింది.

Update: 2024-08-03 06:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీచ్ లో ఈత సరదా ఓ వ్యక్తికి ప్రాణం మీదికి తెచ్చినంత పని అయ్యింది.పోలీసుల సమయస్పూర్తిగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సూర్యలంక బీచ్ లో ఓ వ్యక్తి సరదాగా ఈదుతున్నాడు. సాయంత్రం సమయం కావడంతో అలల ఉదృతి తీవ్రంగా పెరిగింది. ఇది గమణించని ఆ వ్యక్తి మరి కాస్త లోపలికి వెళ్లాడు. ఉదృతి అంతకంతకూ పెరుగుతుండటంతో అతనికి తెలియకుండానే ప్రమాద హెచ్చరిక కోసం ఏర్పాటు చేసిన జెండాను దాటేశాడు. ఇది చూసిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆ వ్యక్తి మునిగిపోతున్నాడని గుర్తించి రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చాడు. అక్కడే ఉన్న రెస్క్యూ టీం చాకచక్యంగా వ్యవహరించి సముద్రంలో మునిగిపోతున్న ఆ వ్యక్తి ప్రాణాలను రక్షించి, ఒడ్డుకు చేర్చారు. దీనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందిస్తూ.. పోలీసుల సమయస్పూర్తిని మెచ్చుకున్నారు. ఆ సమయంలో వారు చూపిన తెగువకు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News