‘అమాయకులను హత్య చేశారు’.. వైసీపీ నేతలపై బాలకృష్ణ ఫైర్

గత వైసీపీ ప్రభుత్వం హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రాష్ట్ర

Update: 2024-06-10 10:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వం హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలను మానసిక క్షోభకు గురి చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో పాలనలో ఎందరో అమాయకులను హత్య చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఏపీలో రోడ్లు దారుణంగా మారాయని, దీంతో ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని స్పష్టం చేశారు.

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానమైన హిందుపురం నుండి బరిలోకి దిగిన బాలయ్య.. సమీప వైసీపీ అభ్యర్థినిపై ఘన విజయం సాధించారు. తాజాగా విజయంతో బాలయ్య ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. దీంతో ఈ సారి చంద్రబాబు కేబినెట్‌లో బాలయ్యకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. మరీ బాలయ్యను మంత్రి పదవి వరిస్తుందా లేదా అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

Tags:    

Similar News