నేడు ఏలూరు జిల్లాలో CM జగన్ పర్యటన

నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.

Update: 2024-02-03 03:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. దెందులూరులో వైసీపీ ‘సిద్ధం’ బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం 3.20 గంటలకు సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. 10 నిమిషాలు ప్రజాప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. మ.3.30కి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లికి సీఎం జగన్ బయల్దేరనున్నారు. ఇక, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు తరలిరానున్నారు. సభకు 5లక్షల మంది వస్తారని వైసీపీ అంచనా వేస్తోంది. 110 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 150 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News