Hyd: నారా రోహిత్-శిరీషను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు

కాబోయే దంపతులు నారా రోహిత్, శిరీషను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆశీర్వదించారు..

Update: 2024-10-13 12:48 GMT

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు నారా రోహిత్-శిరిష నిశ్చితార్థం(Nara Rohit and Shirisha Engagement) హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌(Hyderabad Novatel Hotel)లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) దంపతులతో పాటు నారా, నందమూరి ఫ్యామిలీ(Nandamuri Family) కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ, సినీ నటులు హాజరయ్యారు. నిశ్చితార్థం చేసుకున్న నారా రోహిత్-శిరీషలను చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. నారా రోహిత్ నిశ్చితార్థ కార్యక్రమ ఏర్పాట్లను నారా భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు.

కాగా నారా రోహిత్ 2019లో ‘బాణం’ సినిమాతో వెండితెరకు పరిచమయ్యారు. ఆ తర్వాత విభిన్నమైన సినిమాల్లో నటించారు.ఇటీవల ప్రతినిధి-2 సినిమా చేశారు. ఈ సినిమాలో శిరీష హీరోయిన్‌గా నటించారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో నిశ్చితార్థం కార్యక్రమం జరిగింది. 


Similar News