టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

బతుకమ్మ, దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్ళి సెలవుల అనంతరం తిరిగి హైదరాబాద్ బాట పట్టిన నగరవాసుల వాహనాల రద్ధీతో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది

Update: 2024-10-13 13:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : బతుకమ్మ, దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్ళి సెలవుల అనంతరం తిరిగి హైదరాబాద్ బాట పట్టిన నగరవాసుల  వాహనాల రద్ధీతో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో తిరుగు ప్రయాణం వాహనదారులకు తిప్పలు కల్గిస్తోంది. ఆంధ్ర నుంచి వస్తున్న వాహనాలు విజయవాడ-హైదరాబాద్ హైవే పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల మేర నిలిచి పోయాయి. కరీంనగర్- హైదరాబాద్ రాజీవ్ రహదారి దుద్దేడ టోల్ ప్లాజా వద్ద కూడా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న వాహనాలతో గూడూరు టోల్ ప్లాజా వద్ద అదే పరిస్థితి నెలకొంది.

అద్దం, నార్కట్ పల్లి రహదారి టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ తో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్ ప్లాజా నిర్వాహకులు, స్థానిక పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో చమటోడుస్తున్నారు. 


Similar News