కొనసాగుతున్న కేబినెట్‌ సమావేశం.. సీఎం అధ్యక్షతన కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.

Update: 2024-10-23 06:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు (CM ChandrababuNaidu) అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి వర్గం మొత్తం హాజరైంది. అలాగే ఈ సమావేశంలో ఇసుక, గ్యాస్, రేషన్, అమరావతి (Amaravati) ప్రాజెక్టులపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇసుక సీనరేజ్ రద్దు నిర్ణయాన్ని ఆమోదించి ఉచిత ఇసుక విధానానికి సవరణ చేయడంపై ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు ప్రతిపాదనకు అంగీకారం తెలపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేషన్ డీలర్ల నియామకం, కొత్త రేషన్‌కార్డుల జారీ, వాలంటీర్ల కొనసాగింపు, పోలవరం పనులపై చర్చ, దేవాలయాల పాలక మండలి సంఖ్య పెంపుపై చర్చలతో పాటు అమరావతిలో ప్రాజెక్టులపై కూడా కేబినెట్ చర్చించనుంది. 

Tags:    

Similar News