AP Cabinet: రతన్ టాటాకు ఏపీ కేబినెట్ సంతాపం.. అజెండా వాయిదా

ఏపీ కేబినెట్ మీటింగ్ లో రతన్ టాటా మృతికి మంత్రివర్గం సంతాపం తెలిపింది. అనంతరం అజెండా వాయిదా వేసింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లు రతన్ టాటాకు నివాళులు అర్పించేందుకు ముంబైకి బయల్దేరారు.

Update: 2024-10-10 06:40 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ప్రారంభమైంది. బిజినెస్ దిగ్గజం రతన్ టాటా (86) మృతి (Ratan Tata Demise) పట్ల ఏపీ మంత్రులంతా సంతాపం తెలిపారు. అనంతరం అజెండాను వాయిదా వేసి.. కేబినెట్ సమావేశాన్ని ముగించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రతన్ టాటా భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు ముంబైకి బయల్దేరారు. మధ్యాహ్నం 1.50కి ముంబైకి చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్ లో రతన్ టాటా పార్థివ దేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం తరఫున హోంమంత్రి అమిత్ షా (Amit Shah).. టాటా అంత్యక్రియలకు (Ratan Tata Funerals) హాజరు కానున్నారు. 


Similar News