Breaking: 2025-26కు అసెంబ్లీ కమిటీల ప్రకటన
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Ap Assembly Sesstions) కొనసాగుతున్నాయి. అయితే సమావేశాలు జరుగుతుండగానే కీలక పరిణామం చోటు చేసుకుంది. 2025-26కు ఏపీ అసెంబ్లీ కమిటీలను ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ రూల్స్ కమిటీ చైర్మన్గా అయ్యన్నపాత్రుడు, పిటిషన్ల కమిటీ చైర్మన్గా రఘురామకృష్ణంరాజు, ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్గా పితాని సత్యనారాయణ, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్గా కామినేని శ్రీనివాస్, ఎథిక్స్ కమిటీ చైర్మన్గా మండలి బుద్ధ ప్రసాద్ నియామకమయ్యారు. ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఈ కమిటీలు ఏడాది పాటు పని చేయనున్నాయి.