Ap News: 27 మంది విద్యార్థుల అస్వస్థతకు మూంగ్ దాల్ కారణమా?

ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న 27 మంది విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలడం సంచలనంగా మారింది. ..

Update: 2023-03-03 10:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న 27 మంది విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలడం సంచలనంగా మారింది. ఈ ఘటన సత్యసాయి జిల్లా ఎనుములపల్లిలో జరిగింది. వాసవి స్కూల్‌ను ఓ ట్రస్ట్ నిర్వహిస్తోంది. అయితే స్కూల్‌లో ఉన్నట్టుండి 27 మంది విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తలించారు. అయితే స్కూల్ సమీపంలో వెలువడుతున్న పొగ వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని స్కూల్ టీచర్లు చెబుతున్నారు.

మరోవైపు విద్యార్థులు మూంగ్ దాల్ పాకెట్స్ అస్వస్థతకు గురయ్యారని మరికొందరు అంటున్నారు. దీంతో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్కూల్‌ వద్ద చేరుకుని అక్కడ లభించిన మూంగ్ దాల్ ప్యాకెట్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags:    

Similar News