ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిణామం

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై వేసిన లైంగిక ఆరోపణల కేసు ను క్వాష్‌ చేయాలని ఆదిమూలం హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

Update: 2024-09-20 13:49 GMT

దిశ, వెబ్ డెస్క్: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై వేసిన లైంగిక ఆరోపణల కేసు ను క్వాష్‌ చేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసులో ఇరు పక్షాలు కాంప్రమైజ్‌ కావడంతో పిటిషన్‌‌ను  హైకోర్టు డిస్పోజ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా గత వారం టీడీపీ‌కి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, టీడీపీ మహిళా కార్యకర్త ఆధారాలతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఆరోపణలతో కేసు నమోదు చేసుకున్నారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. 


Similar News