విద్యుత్ షాక్ తో మహిళ మృతి..

విద్యుత్‌షాక్ తో శ్రీ‌రాంపూర్‌లో ఓ మ‌హిళ మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివ‌రాల ప్ర‌కారం శ్రీరాంపూర్ ఏరియా కృష్ణ కాలనీకి చెందిన తీగుళ్ళ శారద ఉదయం ఇంటి ఆవరణలో రేకుల షెడ్డు కింద బట్టలు ఆరేస్తోంది.

Update: 2024-07-07 16:23 GMT

దిశ‌, మంచిర్యాల : విద్యుత్‌షాక్ తో శ్రీ‌రాంపూర్‌లో ఓ మ‌హిళ మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివ‌రాల ప్ర‌కారం శ్రీరాంపూర్ ఏరియా కృష్ణ కాలనీకి చెందిన తీగుళ్ళ శారద ఉదయం ఇంటి ఆవరణలో రేకుల షెడ్డు కింద బట్టలు ఆరేస్తోంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. కుమారుడు వంశి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రజలు విద్యుత్ కనెక్షన్లు, ఎలక్ట్రిక్ పోల్స్ వద్ద నీటి తాకిడి లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై కోరారు.


Similar News