Uttar Pradesh: ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య..

భూవివాదంతో ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో దారుణ హత్యలు జరిగాయి.

Update: 2023-10-02 12:53 GMT

లక్నో : భూవివాదంతో ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో దారుణ హత్యలు జరిగాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మర్డర్ కు గురయ్యారు. రుద్రపూర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ గ్రామ పంచాయతీ లెధాన్ టోలె గ్రామంలో సత్యప్రకాశ్ దూబే కుటుంబం నివసిస్తోంది. సత్యప్రకాశ్​ కు.. అభయ్​పురా టోలె గ్రామానికి చెందిన మాజీ జిల్లా పంచాయతీ సభ్యడు ప్రేమ్​చంద్​ మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈక్రమంలో సోమవారం ఉదయం ప్రేమ్​చంద్ హత్యకు గురయ్యాడు.

ఈ పని సత్యప్రకాశ్ చేయించి ఉండొచ్చని అనుమానంతో ఊగిపోయిన కొందరు దుండగులు.. అతడి ఇంటిపై దాడికి దిగారు. తొలుత సత్యప్రకాశ్ ను, అనంతరం అతడి​ భార్య, ఇద్దరు పిల్లలు సహా మరో వ్యక్తిని మర్డర్ చేశారు. ఈ దాడిలో మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటనపై స్పందించిన ఉత్తర​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఈ ఘటనకు కారకులైన వారిని వదిపెట్టబోమని ప్రకటించారు.


Similar News