ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

లింగంపేట్ మండలం నల్ల మడుగు పెద్ద తండా గ్రామపంచాయతీ

Update: 2024-03-03 10:10 GMT

దిశ,లింగంపేట్ : లింగంపేట్ మండలం నల్ల మడుగు పెద్ద తండా గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ ధనవత్ శ్రీను నాయక్ మృతి చెందినట్లు తాండ మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ తెలిపారు. ఆదివారం ఉదయం హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయడానికి ట్యాంకర్లు నీటి నింపుకొని వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడినట్లు ఆయన తెలిపారు. ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ ధన శ్రీను నాయక్ సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కావేరి కుమారులు ఆదిత్య. శ్రీహాన్ ఉన్నట్లు తెలిపారు.

మృతుని భార్య కావేరి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం ఎల్లారెడ్డి సర్కార్ దావకాన తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Similar News