ముగ్గురు నకిలీ విలేకరుల అరెస్ట్..

వెంకటాపురంలో ముగ్గురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు

Update: 2024-07-06 14:00 GMT

దిశ,ములుగు ప్రతినిధి: వెంకటాపురంలో ముగ్గురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటాపురం సీఐ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం గ్రామ సమీపంలో అర్ధరాత్రి నకిలీ ప్రెస్ లోగోను పట్టుకొని విలేకరులమని పేర్లు చెబుతూ వచ్చిపోయే లారీలను ఆపి వసూళ్లకు పాల్పడుతూ డబ్బులు ఇవ్వని లారీ డ్రైవర్లను కత్తులతో బెదిరిస్తూ విలేకరులమని చలామణి అవుతున్న ముగ్గురుని శనివారం వెంకటాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.32 వేల నగదు, 3 ఐడి కార్డ్స్, నకిలీ ప్రెస్ లోగో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.


Similar News