Missing :తమను వెతకవద్దని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అక్కా తమ్ముడు

తమ కోసం వెతకవద్దని చెప్పి తమ్ముడిని తీసుకొని ఓ యువతి ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

Update: 2024-07-24 08:07 GMT

దిశ, శేరిలింగంపల్లి : తమ కోసం వెతకవద్దని చెప్పి తమ్ముడిని తీసుకొని ఓ యువతి ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా కాలా మండలానికి చెందిన నరేష్ గచ్చిబౌలిలోని మజీద్ బండ ప్రభుపాద లేఅవుట్ నివాసం ఉంటున్నాడు. తన అక్క భర్త చనిపోవడంతో వారి కుమార్తె హారిక(20) కుమారుడు ఫణీంద్ర(19)లను తనవద్దే ఉంచుకొని చిన్నప్పటి నుండి పెంచి, చదువులు చెప్పిస్తున్నాడు. మేనకోడలు కావడంతో 2022 మే 10న నరేష్ హారికను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం హారిక బీటెక్, ఫణీంద్ర ఇంటర్ చదువుతున్నారు. ఇదిలా ఉండగా 2024 ఫిబ్రవరి 20వ తేదిన తాము కాలేజీకి వెళ్తున్నామని చెప్పి హారిక, ఆమె తమ్ముడు ఫణీంద్రలు ఇంట్లో నుండి వెళ్లారు.

తమ కోసం వెతకవద్దంటూ లెటర్ రాసి పెట్టారు. అప్పటి నుండి వారిద్దరి కోసం కుటుంబసభ్యులు వెతికిన ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం నరేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కా తమ్ముడు ఇంట్లో నుండి వెళ్లిపోయిన 5 నెలల తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News