రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలు..

కోడేరు మండలం సింగయ్యపల్లి ఊరిచివర ద్విచక్రవాహనం అదుపుతప్పి భార్య భర్తలు తీవ్ర గాయాలు అయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2024-07-07 15:41 GMT

దిశ, రేవల్లి : కోడేరు మండలం సింగయ్యపల్లి ఊరిచివర ద్విచక్రవాహనం అదుపుతప్పి భార్య భర్తలు తీవ్ర గాయాలు అయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలోని చిక్కపల్లి గ్రామంలోని దర్గ దగ్గరికి వెళ్లి వస్తున్న క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆధార్ కార్డు ఆధారంగా వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రానికి చెందిన వాడల రాజయ్య, వాడల యాదమ్మగా గుర్తించి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి రేవల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని స్థానికులు తెలిపారు.


Similar News