మిలీషియా సభ్యుని లొంగుబాటు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా జెట్టిపాడు గ్రామానికి చెందిన నిషేధిత మావోయిస్టు మిలీషియా సభ్యుడు మడివి జోగా మంగళవారం చర్ల పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Update: 2024-07-02 13:50 GMT

దిశ, చర్ల : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా జెట్టిపాడు గ్రామానికి చెందిన నిషేధిత మావోయిస్టు మిలీషియా సభ్యుడు మడివి జోగా మంగళవారం చర్ల పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రెండు సంవత్సరాలుగా మిలీషియా సభ్యునిగా కొనసాగుతూ మావోలకు సహకరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మావోయిస్టు భావజాలంనందు విరక్తి చెంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ప్రవేశపెట్టిన ఆపరేషన్ చేయూత కు ఆకర్షితుడై లొంగిపోయినట్లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.

Similar News