ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

నారాయణఖేడ్ నుంచి అజ్మీర్ దర్గాకి వెళ్లి తిరిగి రావడంతో పూణే

Update: 2024-07-02 16:40 GMT

దిశ,నారాయణఖేడ్: నారాయణఖేడ్ నుంచి అజ్మీర్ దర్గాకి వెళ్లి తిరిగి రావడంతో పూణే సమీపంలో ఆరుగురు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన నలుగురు, కంగ్టి చెందిన ఒకరు, హైదరాబాద్ చెందిన వారు ఒకరు. ఆరు మంది ముస్లిం యువకులు అజ్మీర్ దర్గా దర్శించడానికి వెళ్లి అజ్మీర్ దర్గా సందర్శించడానికి వెళ్లి తిరిగి వస్తుండగా మహారాష్ట్రంలోని పూణే సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆరుగురు దుర్మరణం చెందారు. వీరు నారాయణఖేడ్ నుంచి కారులో వెళ్లిన రఫీక్ ఖురేషి, ఫిరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, సురేష్, మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, సయ్యద్ ఇస్మాయిల్ మహా రాష్ట్రంలోని పుణే సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వారు తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News