లారీ-బైక్ ఢీ.. ఒకరి మృతి

లారీ బైక్ ఢీ ఒకరి మృతి ఒకరు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2023-09-30 11:19 GMT

దిశ, కాటారం : లారీ బైక్ ఢీ ఒకరి మృతి ఒకరు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 3503 జాతీయ రహదారిపై లారీ, బైక్ ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన విషయాల ప్రకారం.. జాతీయ రహదారిపై కమలాపూర్ ఎక్స్ రోడ్‌కు సమీపంలో కాటారం వైపు వస్తున్న లారీకి, భూపాలపల్లి వైపు వెళ్తున్న బైక్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో మలహర్ మండలం నాచారం గ్రామానికి చెందిన చింతల పెళ్లి రాజు (30) మరణించాడు. దీంతో లారీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని కాటారం ఎస్సై అభినవ్ తెలిపారు.


Similar News