వడ్వాట్ లో పేకాట స్థావరం పై పోలీసుల దాడులు..

మండలం వడ్వాట్ గ్రామశివారులో స్మశాన వాటిక దగ్గర కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెం పెట్టుకొని పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో పోలీసు దాడులు నిర్వహించారు.

Update: 2024-07-07 14:35 GMT

దిశ, మాగనూర్ : మండలం వడ్వాట్ గ్రామశివారులో స్మశాన వాటిక దగ్గర కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెం పెట్టుకొని పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో పోలీసు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 42,300/- రూపాయలు, నాలుగు బైకులు, రెండు సెల్ ఫోన్లు పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ ఎస్సై నవీద్ మాట్లాడుతూ పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తుల పై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హెడ్ కానిస్టేబుల్ అర్జున్ తెలిపారు.


Similar News