లిఫ్ట్ కేస్ లో పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు లిఫ్ట్ కేస్ లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-07-02 13:10 GMT

దిశ, సికింద్రాబాద్ : ప్రమాదవశాత్తు లిఫ్ట్ కేస్ లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ప్రాంతానికి చెందిన నర్సింహ మూర్తి(55) అనే పూజారి ఈస్ట్ మారేడుపల్లిలోని ఫాస్ట్ హైస్కూల్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ప్రీతం అనే వ్యక్తి ఇంట్లో సంవత్సరికం పూజ చేయడానికి మంగళవారం

    ఉదయం 9.30 ప్రాంతంలో వచ్చాడు. ఈ క్రమంలో పై అంతస్తుకు వెళ్లేందుకు గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ కోసం వేచి చూస్తున్నాడు. లిఫ్ట్ కిందకు రాకముందే లిఫ్ట్ డోర్ తెరిచిన నర్సింహ్మ మూర్తి ప్రమాదవశాత్తు లిఫ్ట్ కేస్లో పడిపోయాడు. ఆపై లిఫ్ట్ అతనిపై పడడంతో శ్వాస అందక అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. 

Similar News