కశ్మీర్‌లో భారీగా డ్రగ్స్ సీజ్..

Update: 2023-10-01 10:54 GMT

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌‌లోని రాంబన్‌ జిల్లాలో 30 కిలోల కొకైన్‌‌ను పోలీసులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ స్మగ్లింగ్ వ్యవహారంలో ఇద్దరు పంజాబీలను అరెస్టు చేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి సమీపంలోని రైల్వే చౌక్‌ బానీహాల్‌ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో భారీగా డ్రగ్స్‌ ఉన్నట్టు గుర్తించారు. ఇది హైగ్రేడ్‌ కొకైన్‌ అని జమ్మూ జోన్‌ ఏడీజీపీ ముకేశ్‌ సింగ్‌ వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Similar News