Student Died : అస్వస్థతకు గురై గురుకుల విద్యార్థి మృతి
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి అస్వస్థతకు
దిశ, మెట్ పల్లి : మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మెట్ పల్లి మండలం అరపేట గ్రామానికి చెందిన అద్వైత్ అనే బాలుడు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున తీవ్రంగా ఫిట్స్ రావడం తో గమనించిన సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.