నెలవారీ చిట్టీల పేరుతో మోసం.. రూ.5 కోట్ల వరకు వసూలు చేసిన కుటుంబం అరెస్ట్

వరంగల్ అండర్ రైల్వే గ్రేట్ ప్రాంతానికి చెందిన పుప్పాల రాజేందర్,

Update: 2024-07-08 15:10 GMT

దిశ, వరంగల్ : వరంగల్ అండర్ రైల్వే గ్రేట్ ప్రాంతానికి చెందిన పుప్పాల రాజేందర్, అతని కుటుంబ సభ్యులు కలిసి ప్రభుత్వ అనుమతి లేని మహాలక్ష్మి నెల వారి చిట్టిలను, మహాలక్ష్మి పరపతి సంఘంను ఏర్పాటు చేశారు. 275 మంది సభ్యుల నుండి డిపాజిట్లు రూపంలో సుమారు రూ. 5 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారని వారిపై గ్రూప్ సభ్యులు స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ మల్లయ్య విచారణ చేసి పుప్పాల రాజేందర్ అతని కొడుకు, భార్య, కూతురు పై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.


Similar News