Accident:ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
మహరాష్ట్రలోని పుణె శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ,వెబ్డెస్క్: మహరాష్ట్రలోని పుణె శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే గాయపడినవారిని పుణెలోని ఆసుపత్రికి తరలించారు. వారిని నారాయణఖేడ్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.