గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్ట్..

పెద్దపల్లి జిల్లా మంథని శివారులో గంజాయి తరలిస్తున్న ఐదుగురి

Update: 2024-07-07 10:29 GMT

దిశ,పెద్దపల్లి మంథని : పెద్దపల్లి జిల్లా మంథని శివారులో గంజాయి తరలిస్తున్న ఐదుగురి ని మంథని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి వద్ద నుండి దాదాపు 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భూపాలపల్లి జిల్లా కాటారం, మహాముత్తారం మండలం లో నుండి మంథని, రామగిరి మండలం లో గంజాయిని అమ్మేందుకు వచ్చారని మంథని పోలీసులు పక్కా సమాచారం రావడంతో మంథని, రామగిరి మండల సరిహద్దులో మాటువేసిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దాదాపు మూడు కిలోల గంజాయి దొరికిందని తెలిసింది. వారు రామగిరి పోలీసుల అదుపులో ఉన్నారు.


Similar News