రైలు క్రింద పడి తండ్రి కుమార్తె ఆత్మహత్య

కుటుంబ కలహాలతో తండ్రి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా…కాపాడడానికి వెళ్లిన కూతురు సైతం రైలు క్రింద పడి మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ పట్టణంలో కలకలం రేపింది.

Update: 2024-07-02 11:32 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: కుటుంబ కలహాలతో తండ్రి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా…కాపాడడానికి వెళ్లిన కూతురు సైతం రైలు క్రింద పడి మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ పట్టణంలో కలకలం రేపింది. నవాబుపేట మండలం, చౌడాపూర్ గ్రామానికి చెందిన శివానంద్ (52) స్థానిక ఏనుగొండలో నివాసం ఉంటూ ఎస్వీఎస్ హాస్పిటల్ యజమాని రాంరెడ్డి కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయన కూతురు చందన కూడా అదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తుంది. సోమవారం కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన శివానంద్ రాత్రి ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపైకి వెళ్లాడు. ఆందోళన చెందిన కుమార్తె చందన తండ్రిని కాపాడుదామని రైలు పట్టాలపైకి వెళ్లి బతిమిలాడి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగానే రైలు ఢీకొని తండ్రి, కూతురు మృతి చెందారు. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపారు.

Similar News