మట్టి టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

మట్టి టిప్పర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన గుమ్మడిదల

Update: 2024-07-04 13:38 GMT

దిశ, గుమ్మడిదల: మట్టి టిప్పర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన గుమ్మడిదల మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుమ్మడిదల మండల కేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో గురువారం ఉదయం సమయంలో సంజీవరెడ్డి అనే వ్యక్తి తన యాక్టివా బండిపై పక్కకి ఆగి ఉన్న సమయంలో.. నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న మట్టి టిప్పర్ ఒక్కసారిగా అతడిని ఢీ కొట్టింది. దీంతో సంజీవరెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంజీవరెడ్డి మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసును నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించినట్లు ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.


Similar News