విద్యుదాఘాతానికి గురై గిరిజన బాలుడు మృతి..

కోడేరు మండలంలో ఓ గిరిజన బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.

Update: 2024-07-04 13:33 GMT

దిశ, కొల్లాపూర్ : కోడేరు మండలంలో ఓ గిరిజన బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని రేకులపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని ఒప్పితాండలో జరిగింది. ఒప్పితాండలో శివ (15) అనే బాలుడు వీధిలో విద్యుత్ స్థంభాలు ఎక్కి లైటు బల్బులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తున పై భాగంలో ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తీగలు తగిలి ప్రమాదానికి గురై మృతి చెందినట్లు తండా వాసులు తెలిపారు. కోడేరు పోలీసులు కేసునమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని నాగర్ కర్నూల్ జిల్లా దవాఖానకు తరలించినట్లు చెప్పారు.


Similar News