తండ్రి బర్త్‌డే రోజు కడుపు కోత మిగిల్చిన కొడుకు

తండ్రి బర్త్ డే రోజు కేక్ కట్ చేయించిన కొడుకు చదువు పై విరక్తి చెంది

Update: 2024-04-08 14:06 GMT

దిశ,నవీపేట్ : తండ్రి బర్త్ డే రోజు కేక్ కట్ చేయించిన కొడుకు చదువు పై విరక్తి చెంది యంచ గోదావరి నదిలో దూకి సూసైడ్ చేరుకున్నాడు. ఈ ఘటన మండలంలోని నాగేపూర్ లో చోటుచేసుకుంది. స్థానికులు, ఇంచార్జ్ ఎస్ హెచ్.ఓ గఫర్ సమాచారం ప్రకారం నాగేపూర్ గ్రామానికి చెందిన పులి సూర్య తేజ (18) నిజామాబాద్ లోని వేక్టర్ కాలేజ్ లో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ కు హాజరవుతూ ఉన్నాడు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి ఎంసెట్ క్లాసెస్ అర్థం కావడం లేదని తల్లిదండ్రుల వద్ద బోరున విలపించాడని తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం తండ్రి బర్త్ డే వేడుకలు చేసి దుకాణానికి వెళ్లి వస్తానని బైక్ పై వెళ్లి తిరిగి రాలేదు. అనుమానంతో తండ్రి ఇతరుల బైక్ పై యంచ గోదావరి వద్దకు వెళ్లగా గోదావరి బ్రిడ్జి పై బైక్ ఉండడంతో అక్కడ గల పడవ పై గాలించగా కోన ఊపిరితో ఉన్నాడనుకొని నవీపేట్ స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా మరణించాడని తెలిపారు. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.


Similar News