సింగపూర్ లో తెలుగు యువకుడి మృతి
కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్ లో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి పవన్ బీచ్ కు వెళ్లి అలల ఉధృతికి కొట్టుకుపోయిన మృతి చెందాడు.
దిశ, కోదాడ : కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్ లో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి పవన్ బీచ్ కు వెళ్లి అలల ఉధృతికి కొట్టుకుపోయిన మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా సింగపూర్లో పవన్ ఉద్యోగం చేస్తున్నాడు. అలల ఉధృతి అంచనా వేయలేక గల్లంతైన పవన్ మృతదేహాన్ని సింగపూర్ పోలీసులు బయటకు తీసి మృతదేహాన్ని కోదాడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్ నుండి కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో కోదాడ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.