తనిఖీల్లో యువకుడి వద్ద గంజాయి లభ్యం...

వాహనాల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద గంజాయి లభ్యమైన సంఘటన

Update: 2024-07-07 13:57 GMT

దిశ,మేడిపల్లి : వాహనాల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద గంజాయి లభ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పీర్జాదిగూడ సాయి నగర్ కాలనీ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా టీవీఎస్ ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని అతని వద్ద గల బ్యాగ్ ను పరిశీలించగా అందులో దాదాపు 150 గ్రాముల గంజాయి లభించింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా సూర్యాపేట కు చెందిన సారగండ్ల శివ (20), అని అతడు సాయి కృష్ణ నగర్ కాలనీ, పీర్జాదిగూడలో నివాసం ఉంటున్నాడని తెలియజేసారు. ఆ వ్యక్తి నుండి 150 గ్రాముల గంజాయి,ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించమని అన్నారు. ఈ సందర్భంగా సీఐ గోవింద రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని, మత్తు పదార్థాలు, మరియు డ్రగ్స్ లేకుండా చేయడమే తమ ధ్యేయమని ఆ దిశగా అందరూ సహకరించాలని సూచించారు.


Similar News