ATM చోరీకి యత్నం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో..
మండల కేంద్రంలోని యెర్ర సాయన్న కిరాణా మార్చంట్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం ను గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నం చేశారు.
దిశ, నవీపేట్ : మండల కేంద్రంలోని యెర్ర సాయన్న కిరాణా మార్చంట్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం ను గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నం చేశారు. ముందుగా ఏటీఎం మెషిన్ యొక్క డోర్లు తెరిచి లాకర్ ను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా అలారం మొగింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి సకాలంలో చేరుచేరుకోవడంతో ఇద్దరు నిందితులు పరారయ్యారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు పోలీసులు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు.