ఆటోని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి

నిర్మల్ జిల్లా బాసర మండలం బిద్రెల్లి కి ఆనుకొని ఉన్న మహారాష్ట్ర

Update: 2024-07-06 09:48 GMT

దిశ,భైంసా : నిర్మల్ జిల్లా బాసర మండలం బిద్రెల్లి కి ఆనుకొని ఉన్న మహారాష్ట్ర,నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా బోర్డర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో జరిగే మేకల మార్కెట్ కి మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకా రత్నల్లి గ్రామానికి చెందిన నలుగురు వెళ్లి ఆటోలో మేకలు తెస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ఘటన సంభవించిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాగా,ముగ్గురు తీవ్ర గాయాల పాలు కాగా ఇద్దరినీ నాందేడ్ కి ఒకరిని, నిజామాబాద్ కి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు.


Similar News