పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం..

Update: 2023-10-05 16:40 GMT

దిశ, పేట్ బషీరాబాద్: పరుపుల కంపెనీలో షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం జరిగిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో నేచర్ స్లీప్ మ్యాటర్స్ అనే పరుపుల కంపెనీ ఉన్నది. 6 షటర్లు ప్రాంగణంలో ఉన్న ఈ కంపెనీ ఆనుకొని మరో షెటర్‌లో వర్క్ షాప్‌లో.. గురువారం రాత్రి 7 గంటల సమయంలో వర్క్ షాప్ మిషనరీ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడం ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న కంపెనీలో ఉన్న పరుపులకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి.


దీంతో సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఇటువంటి ప్రమాదం జరగలేదు.


Similar News