నిద్రిస్తున్న మేనత్తపై బాలుడు అత్యాచారం.. దిండుతో ఘోరంగా..!

కన్నతల్లి తర్వాత మేనత్తను తల్లిగా భావిస్తుంటారు. మేనల్లుడిని తమ తోబుట్టువులుగానే భావించి కంటికి రెప్పలా చూసుకుంటారు.

Update: 2024-06-20 12:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కన్నతల్లి తర్వాత మేనత్తను తల్లిగా భావిస్తుంటారు. మేనల్లుడిని తమ తోబుట్టువులుగానే భావించి కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ కామంతో రగిలిపోయిన ఓ మైనర్ బాలుడు మేనత్తపై కన్నేశాడు. పదో తరగతి చదువుతున్న అతడు పడక సుఖం కోసం దారుణానికి పాల్పడ్డాడు. మేనత్తపై అత్యాచారం చేయడంతోపాటు ఆమెను చంపేసి కొత్త నాటకానికి తెరలేపాడు. కర్ణాటకలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడి గ్రామానికి చెందిన 37 ఏళ్ల వయసున్న మహిళ తెల్లారేసరికి మరణించింది. ఎంతో ఆరోగ్యంతో చలాకిగా ఉండే ఆమె హఠాత్తుగా మృతిచెందడం కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులను విస్మయానికి గురి చేసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ క్రమంలో ఆమె ఒంటిపై గాయాలు కనిపించడం, మృతికి ముందు పెనుగులాడినట్టు ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేశారు.

ఇదే సమయంలో టెన్త్ క్లాస్ చదువుతున్న మైనర్ బాలుడి ఇంటికి వెళ్లి తన మేనత్త గుండెపోటుతో మృతిచెందిందని తండ్రికి చెప్పాడు. ఆయన హుటాహుటిన తన సోదరి ఇంటికి వెళ్లి మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి మేనల్లుడిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో ఎంక్వైరీ చేయడంతో అసలు విషయం బయటపడింది. ‘‘సాయంత్రం సమయంలో తన మేనత్త ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా నిద్రపోతుందని చెప్పాడు. అప్పటికే శృంగార కోరికలతో ఉన్నానని, నిద్రపోతున్న మేనత్త దుస్తులు తొలగించి అత్యాచారం చేయబోయనని, మేల్కొన్న ఆమె తనను నెట్టేసిందని తెలిపాడు. ఆ సమయంలో మేనత్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్టిందని, విషయాన్ని ఇంట్లో చెబుతానని అనడంతో భయపడి దిండుతో ఆమె మొఖంపై అదిమి హత్య చేశానని’’ పోలీసులు వివరించాడు. బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.


Similar News