రాష్ట్రంలో భారీ వర్షాలు.. పిడుగుపాటకు 9 మంది మృతి
భారత్ లోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్లోని ఆరు జిల్లాల్లోకురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: భారత్ లోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్లోని ఆరు జిల్లాల్లోకురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. జెహానాబాద్, మాధేపురా, తూర్పు చంపారన్, రోహ్తాస్, సరన్, సుపాల్ జిల్లాల్లో ఈ పిడుగుపాటు మరణాలు చోటు చేసుకున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిడుగుపాటు మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.