నెత్తురోడిన బెలూచిస్తాన్ మసీదు..
పాకిస్థాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ పరిధి మస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు ప్రాంగణంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు.
కరాచీ : పాకిస్థాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ పరిధి మస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు ప్రాంగణంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో దాదాపు 52 మంది చనిపోయారు. మృతుల్లో డీఎస్పీ నవాజ్ గాష్కోరి కూడా ఉన్నారు. డీఎస్పీ కారు పక్కనే నిలబడి సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఈ పేలుడు ధాటికి డీఎస్పీ నవాజ్ గాష్కోరి అక్కడికక్కడే చనిపోయారని వెల్లడించాయి. మిలాదున్ నబీ పండుగ వేళ ఈ మసీదులో ప్రార్థనల కోసం వచ్చిన మరో 100 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.