ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉధృతి ఏమాత్రం ఆగడం లేదు. గడిచిన 24గంటల్లో 72,811మందికి పరీక్షలు నిర్వహించగా 6,242మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. 40మంది మృతిచెందిడంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,981గా ఉంది. ప్రస్తుతం 54,400 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 6,58,875మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 7,084మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60లక్షల 94వేల, 206మందికి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం […]

Update: 2020-10-04 07:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉధృతి ఏమాత్రం ఆగడం లేదు. గడిచిన 24గంటల్లో 72,811మందికి పరీక్షలు నిర్వహించగా 6,242మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. 40మంది మృతిచెందిడంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,981గా ఉంది. ప్రస్తుతం 54,400 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 6,58,875మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 7,084మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60లక్షల 94వేల, 206మందికి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా బారిన పడి కృష్ణా జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా అనంతపురం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లా, విజయనగరం జిల్లాలో ఒకరు చొప్పున చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 411 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరులో 863, తూర్పుగోదావరిలో 826, గుంటూరులో 562, కడపలో 408, కృష్ణా జిల్లాలో 469, కర్నూలులో 220, నెల్లూరులో 413, ప్రకాశంలో 582, శ్రీకాకుళంలో 192, విశాఖపట్నంలో 222, విజయనగరంలో 221, పశ్చిమగోదావరి జిల్లాలో 853 కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News