ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన అమిత్‎షా

by Shamantha N |
ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన అమిత్‎షా
X

దిశ, వెబ్‎డెస్క్: మిజోరాం, అస్సాం సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా ఫోన్‎లో మాట్లాడారు. సరిహద్దుల్లో తలెత్తిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారు. ఘర్షణలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆయా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో చెప్పాలని ఇరువురిని అడిగినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో వివాదం తలెత్తిన నేపథ్యంలో సీనియర్ అధికారుల మధ్య చర్చలు ప్రారంభించినట్లు అస్సాం సీఎం అమిత్‎షా దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement

Next Story