రాజీవ్ రహదారిపై ప్రమాదం.. ఆరు కార్లు ధ్వంసం

by Shyam |
Accident
X

దిశ, శామీర్ పేట్: రోడ్డు ప్రమాదంలో కార్లు ధ్వంసం అయిన సంఘటన తూముకుంట మున్సిపాలిటీ రాజీవ్ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం నుంచి శామీర్ పేట్ వైపు వస్తున్న ఆర్మీ వాహనం ముందుగా వెళ్తున్న కారును అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కారు మరో కారుతో తగులుకుంటూ.. మొత్తం 6 కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో కార్లు స్వల్పంగా ధ్వంసం కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్లపై వాహనాలను తొలిగించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Advertisement

Next Story