ఆగివున్న లారీని ఢీకొన్న పోలీసుల వాహనం

by Sumithra |
ఆగివున్న లారీని ఢీకొన్న పోలీసుల వాహనం
X

దిశ, హుస్నాబాద్: ఆగివున్న లారీని పోలీసుల వాహనం ఢీకొని ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కొహెడ మండలం లక్ష్మీపూర్ స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని పోలీస్ బోలెరో వాహనం ఢీకొందన్నారు. వాహనంలో ఐదుగురు కానిస్టేబుళ్లు ఉండగా వారు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. తాడికొండ రవి అను కానిస్టేబుల్ కు తీవ్రగాయాలవ్వడంతో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు బొలెరో వాహనంలో హుస్నాబాద్ నుండి తోగుటకు బందోబస్తుకు వెళుతున్నాట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed