- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జుక్కల్: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. నీట మునిగి ఊపిరాడక ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం మర్పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ రాజలింగం కథనం ప్రకారం.. మర్పల్లి శివారులో గల నల్లవాగులో ఏర్పాటు చేసిన వ్యవసాయ బోరు మోటర్లు తీసేందుకు తోటి రైతులతో భూపతి సాయిలు(40) నీటిలో దిగాడు.
ఆ సమయంలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాగులో చిక్కుకున్నాడు. నీటి ఉధృతి పెరగడంతో ఊపిరాడక మృతి చెందినట్లు తోటి రైతులు వెల్లడించారు. కాగా, మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రాజలింగం తెలిపారు.
Next Story