నీట మునిగి ఒకరు మృతి

by  |
నీట మునిగి ఒకరు మృతి
X

దిశ, జుక్కల్: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. నీట మునిగి ఊపిరాడక ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం మర్పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ రాజలింగం కథనం ప్రకారం.. మర్పల్లి శివారులో గల నల్లవాగులో ఏర్పాటు చేసిన వ్యవసాయ బోరు మోటర్లు తీసేందుకు తోటి రైతులతో భూపతి సాయిలు(40) నీటిలో దిగాడు.

ఆ సమయంలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాగులో చిక్కుకున్నాడు. నీటి ఉధృతి పెరగడంతో ఊపిరాడక మృతి చెందినట్లు తోటి రైతులు వెల్లడించారు. కాగా, మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రాజలింగం తెలిపారు.



Next Story