- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మన గొంతును మనమే కోసుకోవద్దు.. డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్లో భట్టి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ పూనుకుందని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేస్తే మన గొంతును మనమే కోసుకున్న వాళ్లం అవుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్లోని ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినవే అన్నారు. మిగిలిన పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూడా తమదే అని తెలిపారు. రైతుబంధు రాకుండా బీజేపీ, బీఆర్ఎస్లు కుట్రలు చేశాయని ఆరోపించారు. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందన్నారు. ‘సంపద పెంచుతాం.. పంచుతాం’ ఇదే కాంగ్రెస్ నినాదమని తెలిపారు.
కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇవ్వగానే బీజేపీ కుట్రలు మొదలు పెట్టిందని భట్టి విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టామన్నారు. దేశంలో అధికారంలోకి రాగానే మా ప్రభుత్వం కులగణన చేస్తుందని తెలిపారు. రిజర్వేషన్లు కాపాడుకునేందుకు ఎస్సీ, ఎస్టీ ,బీసీ లు కాంగ్రెస్కు ఓటు వేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యంగం ప్రమాదంలో ఉందన్నారు. దేశంలో భయానక పరిస్థితులు ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు బీజేపీ చేస్తున్న అన్యాయానికి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారన్నారు. కేసీఆర్, బీజేపీ ముసుగు తీసేసి మాట్లాడితే మంచిదన్నారు.